రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు తన వద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుత మైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇది భారతీయ యాక్షన్ సినిమాల ప్రమాణాలను పెంచేలా ఉన్న హై-ఆక్టేన్, హై బడ్జెట్తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అద్భుతంగా సెట్స్ని డిజైన్ చేశారు. ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ వంటి చిత్రాల్లో తన వర్కింగ్ స్టయిల్తో ఆకట్టుకున్న నబాకాంత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు. ఈ మైండ్-బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్గా వుండబోతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
భారీ సెట్లో ‘పెద్ది’ యాక్షన్ సన్నివేశాలు
- Advertisement -
- Advertisement -