నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతి పండుగకు కొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మద్యం ప్రియులకు ఊహించని షాక్ ఇచ్చింది. కొన్ని రకాల మద్యం బాటిళ్ల ధరలను ఒక్కసారిగా పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 ధర పెంచుతూ నిన్న ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ని సైజుల బాటిళ్లపై ఈ ధర పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే రూ.99 (180 ఎంఎల్) ధర ఉన్న ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, బీర్, వైన్, ఆర్టిడీలను ఈ పెంపు నుంచి మినహాయించినట్లు తెలిపింది. అదే విధంగా బార్లపై విధిస్తున్న అదనపు ఏఆర్ఈటీని తొలగించేందుకు అంగీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్లు, షాపుల మధ్య ధరల సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రిటైలర్ మార్జిన్ను సుమారు ఒక శాతం పెంచుతున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.
మద్యం ప్రియులకు బిగ్ షాక్..పెరిగిన ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



