Tuesday, June 24, 2025
E-PAPER
Homeజాతీయంఏపీ రాజధానిలో బీజేపీకి రెండెకరాలు

ఏపీ రాజధానిలో బీజేపీకి రెండెకరాలు

- Advertisement -

– ఆరు సంస్థలకు భూ కేటాయింపులు
– ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
అమరావతి:
రాజధాని పరిధిలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భూ పందేరం గావించింది. అందులో భాగంగా బీజేపీి కార్యాలయానికి రెండెకరాలు కేటాయించింది. అలాగే అమరావతిలో కొత్తగా ఆరు సంస్థలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. గతంలో భూములు పొందిన నాలుగు సంస్థలకు ఇచ్చిన విస్తీర్ణంలో మార్పులు చేసింది. రెండు సంస్థలకు రద్దు చేసింది. సోమవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో రాజధానిలో భూముల కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం 18వ సమావేశం జరిగింది. దీనికి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల మంత్రి టిజి భరత్‌ హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, కందుల దుర్గేష్‌ ఆన్‌లైన్లో పాల్గొన్నారు.
అనంతరం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. మొత్తం 16 అంశాల ఎజెండాలో 12 అంశాలకు సబ్‌ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌, ఏపీ గ్రామీణ బ్యాంకుకు రెండెకరాల చొప్పున కేటాయించారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 40 సెంట్లు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబి)కి 50 సెంట్లు, బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌కు 50 సెంట్లు కేటాయించారు. 2014-17 మధ్య కాలంలో 130 సంస్థలకు 1,270 ఎకరాలు కేటాయించగా, గత ప్రభుత్వం నిర్వాకంతో పలు సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయని తెలిపారు. ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపి తిరిగి కేటాయింపుల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. భూములు పొందిన సంస్థలు వీలైనంత త్వరగా వాటి నిర్మాణాలు పూర్తి చేస్తాయని వివరించారు. అమరావతిలో ఇప్పటికే పదివేలమందికిపైగా కార్మికులు పనుల్లో ఉన్నారని, వర్షాలు తగ్గుముఖం పట్టేనాటికి 20 వేలమంది కార్మికులతో పనులు శరవేగంగా కొనసాగుతాయని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే 2014-19 మధ్యకాలంలో భూములు కేటాయించిన పలు సంస్థలకు తిరిగి కేటాయింపుల్లో మార్పులు చేస్తూ సబ్‌ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు రెండెకరాల చొప్పున కేటాయించారు. స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు ఐదెకరాలు, ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు మూడు ఎకరాలను కేటాయింపు కొనసాగింపునకు అనుమతినిచ్చారు. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయింపు జరిపిన విస్తీర్ణంలో స్వల్ప మార్పులు చేశారు. గెయిల్‌ ఇండియా, అంబికా అగర్‌బత్తి సంస్థలకు గతంలో కేటాయించిన భూములను రద్దు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -