నవతెలంగాణ-హైదరాబాద్: తొక్కిసలాట ఘటనపై బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై తమ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, విధులు నిర్వహించడంలో అలసత్వం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కండ్ల ముందే తమ ప్రభుత్వ చర్యలు కన్పిస్తున్నా..బీజేపీ నేతలు రాద్దాంతం చేయడం సరైన పద్ధతి కాదని, దుష్ప్రచారాలను మానుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీజేంద్రర్ కావాలనే తమ ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ఆర్సీబీ, కర్నాటక క్రికిట్ బోర్టు సభ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
2025 ఐపీఎల్ ట్రోఫీని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 5న ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్న స్వామి స్టేడియాంలోకి అభిమానులు ఒక్కసారిగా పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో తొక్కిసలాట జరిగి 11మంది చనిపోగా..50మందిపైగా గాయపడ్డారు. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి..మెరగైన చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను “బలిపశువు”గా మార్చిందని బిజెపి ఆరోపించింది. తాజాగా బీజేపీ కామెంట్లకు సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు.