- Advertisement -
– టీపీసీసీ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దగ్దం
నవతెలంగాణ-బెజ్జంకి : కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలుపొందారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రలో వాఖ్యలు చేయడం అర్థరహితమైనవని బీజేపీ మండల శ్రేణులు ఖండించారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ అధ్యక్షుడి వాఖ్యలు నిరసిస్తూ సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మహేశ్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను మండల బీజేపీ శ్రేణులు దగ్దం చేశారు. బీజేపీ శ్రేణులు బుర్ర మల్లేశం, సంగ రవి, సాన వేణు, రామచంద్రం ఉన్నారు.
- Advertisement -