- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హరియాణాలో ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ను విమర్శించారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్కు ఇది నిదర్శనం. కులం పేరిట ఐపీఎస్ అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.
- Advertisement -



