- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఉత్కంఠ వీడింది. ఛైర్పర్సన్గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక ఎన్నికయ్యారు. ఆమెకు అనుకూలంగా ఏడుగురు బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేతులెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యానికి అనుకూలంగా ఆరుగురు చేతులెత్తారు. దీంతో మౌనిక ఛైర్పర్సన్గా విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
- Advertisement -



