- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: న్యూయార్క్ లో పడవ ప్రమాదం జరిగింది. న్యూయార్క్ లోన బ్రూక్లిన్ వంతెనను మెక్సికన్ నేవీ షిప్ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయయి. ప్రమాద సమయంలో నౌకలో 277 మంది ఉన్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. క్యాడెట్ శిక్షణనౌక న్యూయార్క్ హార్బర్ నుండి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే న్యూయార్క్ అగ్నిమాపక విభాగం సహాయక చర్యలు చేపట్టింది. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -