- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ పేలుళ్లు కలకలం రేపాయి. ఫైసలాబాద్లో ఓ గ్లూ(గమ్) తయారుచేసే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ దుర్ఘటనలో దాదాపు 15మంది మృతి చెందాగా..పలువురికి తీవ్రగాయాలైయ్యాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనంతో పాటు చుట్టుపక్కల ఇల్లు కూడా దెబ్బతిన్నాయి.అయితే పేలుడుకు గల కారణాలేంటనేది తెలియరాలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన అనంతరం ఫ్యాక్టరీ యజమాని పరారవగా.. మేనేజర్ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



