నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్లోని ప్రభుత్వ పాఠశాలపై బాంబు దాడి జరిగింది. వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలపై శుక్రవారం ఉదయం గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. తంక్ జిల్లాలోని గుల్ ఇమామ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని అన్నారు. పేలుడు పదార్థాలను వినియోగించడంతో పాఠశాలలోని పలు తరగతి గదులు కూలిపోయాయని అన్నారు. అయితే ఈ ఘటనకు భాద్యత వహిస్తున్నట్లు ఏ సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.
నిషేధిత తెహ్రీక్-తాలిబన్-పాకిస్తాన్ (టిటిపి)కి చెందిన అనుబంధ సంస్థలు తంక్ జిల్లాలో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సంస్థలు బాలికల విద్యకు, పాఠశాలలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లో 450కి పైగా పాఠశాలలను ఇదే తరహాలో కూల్చివేసినట్లు స్థానిక ఎన్జిఒ నివేదికలో తెలిపింది.