- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని ధౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్కు బాంబు బెదిరింపు ఈమెయిల్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే మెయిల్స్ రాకతో ఆందోళనకు గురైైన కొందరు తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాల ఇంటికి తీసుకువెళ్లారు. ఎటువంటి బాంబులను కనుగొనలేదని, గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -



