- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హర్యానా సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సీఎం కార్యాలయ భవనానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. కేంద్ర బలగాలు, హర్యానా పోలీసులు, చండీగఢ్ పోలీసులు సచివాలయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా సచివాలయం చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని కూడా తనిఖీ చేశాయి. నిర్వహించనున్నారు.
- Advertisement -