నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టకు కు శనివారం రాత్రి బాంబు పెట్టామని, మరికొద్ది క్షణాల్లో ఎయిర్పోర్టును పేల్చేస్తానని జీఎంఆర్ కాల్ సెంటర్ కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సీఐ ఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో రోజంతా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎయిర్పోర్టులో ఎలాంటి బాంబు లేదని అధికారులు గుర్తించారు. ఇది ఫేక్ కాల్ గా కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.