- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. విశ్వవిద్యాలయానికి సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఒక ఈమెయిల్ వచ్చింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే, బాంబు స్క్వాడ్ మరియు పోలీసులు హెలిప్యాడ్ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు.
- Advertisement -