- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టామని శనివారం ఓ అగంతకుడు ఫోన్ కాల్ చేసి బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకోగానే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు ప్రారంభించాయి. బాంబు లేదని నిర్ధారణకు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఒక్కసారిగా తనిఖీలు చేపట్టడంతో ప్రయాణికులు ఏమైందోనని ఆందోళన చెందారు.
- Advertisement -