నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం తారాస్తాయికి చేరింది. రెండు దేశాలు క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజాము నుంచే మిస్సైల్ లతో భీకర దాడులు చేసుకున్నాయ. బాంబుల మోతతో పలు పట్టణాలు దద్దరిల్లాయి.శనివారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణులు, రాకెట్లు ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ (Tel Aviv) లో విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో ఇజ్రాయిల్ పౌరులు 34 మంది గాయపడగా.. ఒకరు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్లోని రెండు అతిపెద్ద నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 78 మంది మృతి చెందారని ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి అమీర్ సయీద్ తెలిపారు. 320 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పౌరులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్.. ఇరాన్లోని సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపారు.
