Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమహారాష్ట్రలో కూలిన వంతెన

మహారాష్ట్రలో కూలిన వంతెన

- Advertisement -

ఇంద్రాణి: మహారాష్ట్ర లోని పుణెలో ఇంద్రాణి నదిపై ఉన్న పురాతన వంతెన కుప్ప కూలింది. ఈ ఘటనలో ఆరు గురు మృతిచెందగా.. సుమారు 32 మంది నదిలో గల్లంత య్యారు. ప్రమాద సమాచారం తెలిసి రంగంలోకి దిగిన సహా యక బృందాలు ఆరుగురిని రక్షించాయి. ఆదివారం కావడం వల్ల పెద్ద సంఖ్యలో కుండమలకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెనపైకి చేరుకున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ బ్రిడ్జి కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినదని అధికారులు తెలిపారు. వంతెన పాతదైపోవడంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను దీనిపై నిలిపివేసినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రాణిలో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం రంగంలోకి దిగాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad