నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్ దేశానికి బ్రిటన్ అండగా నిలుస్తోంది. 2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్కు లక్ష డ్రోన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఉక్రెయిన్ కు 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతు ఇస్తామని గతంలోనే బ్రిటన్ ప్రకటించింది. అందులో భాగమే ఈ 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ భాగమని పేర్కొంది. స్వతంత్రంగా ఉత్పత్తి చేసిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. రష్యన్ దురాక్రమణతో సహా ఇతర ముప్పులను ఎదుర్కోవడానికి కీవ్కు మిలిటరీ మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. బ్రస్సెల్స్లో నిర్వహించనున్న 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈ ప్రకటన చేయనున్నారు. ఇటీవలే రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులకు (Ukraine-Russia) పాల్పడడంతో మాస్కోకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి.
ఉక్రెయిన్కు అండగా బ్రిటన్.. లక్ష డ్రోన్లు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES