Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమంత్రి తుమ్మలను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు..

మంత్రి తుమ్మలను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమకాలేదు. దీంతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే రంగరెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు ఆయా మండలాలకు చెందిన రైతులతో కలసి సబిత ఇంద్రారెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వినతి పత్రం అందచేశారు. తక్షణమే ఆయా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad