- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో శాసన సభలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నిల్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆందోళన చేపట్టారు.ఈ సమావేశాల్లో ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
- Advertisement -



