నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగానే ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గురువారం ఆయన ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోందన్నారు. మంత్రి శ్రీధర్బాబు ఆస్పత్రిలో గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపీనాథ్ తనకు సన్నిహితుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తోడుగా ఆస్పత్రిలో కేటీఆర్ సతీమణి శైలిమ ఉన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు కేటీఆర్కు తెలియజేస్తున్నారు.
విషమంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోగ్యం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES