నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసలేదని కాంగ్రెస్ విమర్శిచింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ‘పూర్తిగా నీరసంగా’ ఉందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ పేర్కొన్నారు. బడ్జెట్పై పూర్తి అంచనాలను అందుకోలేకపోయిందని అన్నారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆమె ప్రసంగంలో పారదర్శకత లోపించిందని, కీలక కార్యక్రమాలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎటువంటి ప్రకటనలు లేవని అన్నారు. ”డాక్యుమెంట్లను వివరంగా అధ్యయనం చేయవలసి ఉన్నప్పటికీ.. 90 నిమిషాల బడ్జెట్ ప్రసంగం అంచనాలను అందుకోలేకపోయింది. ఇది పూర్తిగా నిరుత్సాహంగా ఉంది” అని జైరామ్ రమేష్ ఎక్స్లో పేర్కొన్నారు.
‘పస’ లేని బడ్టెట్ : జైరామ్ రమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



