Friday, October 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి

బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేశ్‌ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గొల్ల రమేశ్‌ (35), అనూష (30), మన్విత (10), మనీశ్‌ (12) మృతి చెందారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగి సుమారు 20 మందికి పైగా మృతి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -