– బిఆర్ఎస్ గ్రామా శాఖ ప్రధాన కార్యదర్శి బండి రాజు గౌడ్ డిమాండ్
నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు నుండి తూర్పుగూడెం గ్రామానికి బస్సు సర్వీసు తక్షణం పునరుద్ధరించాలని బిఆర్ఎస్ పార్టీ గ్రామా శాఖ ప్రధాన కార్యదర్శి బండి రాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆలేరు నుండి తూర్పుగూడెం బస్సు సర్వీసు నిలిపివేయడంతో విద్యార్థులు,ఉద్యోగులు,గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగూడెం ప్రజల రాకపోకలు,విద్యార్థుల విద్యా ప్రయాణం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతిరోజు ఆలేరు నుండి ఉదయం 8.00 గంటలకు బస్సు బయలుదేరి తూర్పుగూడెం గ్రామానికి 8.30 గంటలకు చేరుకునేలా,అలాగే సాయంత్రం 5.00 గంటలకు ఆలేరు నుండి బయలుదేరి 5.30 గంటలకు తూర్పు గూడెం చేరుకునేలా బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.