- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ- ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరో 75 మంది గాయపడినట్లు తెలిపారు.
- Advertisement -



