Thursday, June 19, 2025
E-PAPER
Homeజాతీయంఐదు రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌లు

ఐదు రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌లు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల‌కు గురువారం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని నీలంబర్ స్థానం, పంజాబ్‌లోని లూధియానా వెస్ట్ స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని కాలిగంజ్ స్థానం, గుజరాత్‌లోని విశావదర్, కాడి స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జూన్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫిబ్రవరిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి.

కేరళ: నిలంబర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు
నీలంబుఫ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ తరపున ఎం స్వరాజ్, యుడిఎఫ్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ తరపున మోహన్ జార్జ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విస్తృతమైన వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ ద్వారా ఉప ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించడంతో పాటు, కేంద్ర భద్రతా దళాలు మరియు పోలీసులను మోహరించడం వంటి గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 2,32,381 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో 1,13,613 మంది పురుషులు, 1,18,760 మంది మహిళలు మరియు ఎనిమిది మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

పంజాబ్: లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు గురువారం ఉదయం 7 గంటలకు గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రారంభమైంది. జనవరిలో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి మరణంతో లూథియానా పశ్చిమ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. లూథియానా పశ్చిమ సెగ్మెంట్ బహుముఖ పోటీ జరుగుతుంది. ప్రధాన రాజకీయ సంస్థలు – ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, బిజెపి మరియు శిరోమణి అకాలీదళ్ అర్బన్ నియోజకవర్గంలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ : కాలిగంజ్ స్థానానికి పోలింగ్ ప్రారంభం

ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఆయన కుమార్తె అలీఫా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. సీపీఐ(ఎం) మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా కబిల్ ఉద్దీన్ షేక్‌, బిజెపి అభ్యర్థిగా ఆశిష్ ఘోష్‌ లు పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్-వామపక్ష కూటమి మధ్య త్రిముఖ పోటీగా మారనుంది.

గుజరాత్ : విసావదర్, కాడి అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభం
గుజరాత్‌లోని విసావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఓటింగ్ కోసం రెండు నియోజకవర్గాలలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించిందని గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

అప్పటి ఆప్ శాసనసభ్యుడు భూపేంద్ర భయానీ రాజీనామా చేసి అధికార బిజెపిలో చేరిన తర్వాత జునాగఢ్ జిల్లాలోని విసావదర్ స్థానం డిసెంబర్ 2023 నుండి ఖాళీగా ఉంది. షెడ్యూల్డ్ కుల (SC) అభ్యర్థులకు రిజర్వు చేయబడిన నియోజకవర్గమైన మెహ్సానా జిల్లాలోని కడి స్థానం, బిజెపి ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణం తర్వాత ఫిబ్రవరి 4 నుండి ఖాళీగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -