Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ..

నేడు సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ..

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అవకతవకలపై విచారణను ఏసీబీకి అప్పగించాలా? లేదా సిట్ ను ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి  కాళేశ్వరం వ్యవహారంపై BRS ను నిలదీయాలని మంత్రివర్గం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -