Friday, June 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆటోను ఢీకొట్టిన కారు..న‌లుగురు కూలీలు మృతి

ఆటోను ఢీకొట్టిన కారు..న‌లుగురు కూలీలు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో నలుగురు కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆత్మకూరు మండల పరిధిలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఆత్మకూరు పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు. అయితే, కూలీలంతా వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్‌ చేసేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -