- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లోని బేగంపేట ఫ్లైఓవర్పై డివైడర్ను ఢీకొని కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
- Advertisement -



