Thursday, June 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభక్తుల సమూహం పైకి దూసుకెళ్లిన కారు..నలుగురు మృతి

భక్తుల సమూహం పైకి దూసుకెళ్లిన కారు..నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆలయం వైపు వెళ్తున్న భక్తుల సమూహంపైకి కారు దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ దారుణమైన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలైనే దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే విరుదాచలం ఆలయానికి కొంతమంది భక్తుల సమూహం పాదయాత్రగా వెళ్తున్న క్రమంలో అతి వేగంగా వచ్చి అదుపుతప్పిన భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో పాదయాత్రలో ఉన్న భక్తుల్లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని.. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -