Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగర్‌ మంగ్లీపై కేసు

సింగర్‌ మంగ్లీపై కేసు

- Advertisement -

– ఆమె బర్త్‌డే వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి వాడారంటూ సోదాలు
– రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి త్రిపుర రిసార్ట్స్‌లో అర్ధరాత్రి హంగామా
నవతెలంగాణ-చేవెళ్ల

ప్రముఖ తెలంగాణ ఫోక్‌ సింగర్‌ మంగ్లీ చిక్కుల్లో పడింది. గాయని మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్టులో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరైనట్టు సమాచారం. అయితే, ఈ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో, అప్రమత్తమైన పోలీసు ప్రత్యేక బృందాలు రిసార్టుపై మెరుపు దాడులు చేశాయి. ఈవెంట్‌కు 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండిస్టీకి చెందిన వాళ్లు ఉన్నారు. అనుమతి లేకుండా ఈవెంట్‌ నిర్వహించడంతోపాటు పర్మిషన్‌ లేకుండా మద్యం వాడకంపై మంగ్లీతో పాటు రిసార్ట్స్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శివ రామకృష్ణ, ఈవెంట్‌ మేనేజర్‌ దున్నే మేఘరాజు, దామోదర్‌రెడ్డి, సత్యవతి అలియాస్‌ మంగ్లీపై చేవెళ్ల పోలీసులు ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్టీలో ఖరీదైన మద్యం సీసాలు లభ్యమైనట్టు సమాచారం. దాంతో పార్టీలో ఉన్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఒకరికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి మాదకద్రవ్యాల వాడకంపై చర్చ మొదలైంది. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. పార్టీ నిర్వాహకుల పాత్రపై సైతం పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -