Sunday, June 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేటీఆర్‌పై కేసు నమోదు

కేటీఆర్‌పై కేసు నమోదు

- Advertisement -

– సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
నవతెలంగాణ-సిటీబ్యూరో

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ రెండ్రోజుల కిందట ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు, అలాగే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలను సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్‌ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నా యని బల్మూరి వెంకట్‌ ఫిర్యాదులో తెలిపారు. ఇదిలావుండగా, టీపీసీసీ లీగల్‌ సెల్‌ అడ్వకేట్‌ భానుచందర్‌ కూడా కేటీఆర్‌ వ్యాఖ్యలపై శనివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, రాజకీయ కక్షలో భాగంగానే తమ నేతపై కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -