- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్కు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లేలా చేసిన వ్యవహారంలో ఈ కేసు పెట్టింది. యూనియన్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్కు డైరెక్టర్గా ఉన్న జై అన్మోల్ అంబానీతో పాటు రవీంద్ర శరద్ సుధాకర్పైనా కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి.
- Advertisement -



