- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రయాణికుల భద్రతను మెరుగుపరచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 74,000 కోచ్లు, 15,000 లోకో కోచ్లకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల నార్తరన్ రైల్వేలో ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతమైన క్రమంలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. డోమ్ ఆకారంలో ద్వారాల వద్ద కెమెరాలు, లోకో కోచ్లకు ఆరు కెమెరాలు ఉంటాయి. చీకటిలోనూ స్పష్టమైన ఫుటేజీ కోసం అధునాతన సాంకేతికత, అవసరమైతే కృత్రిమ మేధా వినియోగించనున్నారు.
- Advertisement -