Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబనకచర్ల ప్రాజెక్టు వెనుక కేంద్రం కుట్ర

బనకచర్ల ప్రాజెక్టు వెనుక కేంద్రం కుట్ర

- Advertisement -

తెలంగాణ జలదోపిడీపై రాష్ట్ర బీజేపీ మౌనం
ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం : ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌ వెనుక కేంద్రం కుట్ర ఉందని టీజేఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. తెలంగాణ జల దోపిడీకి నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్రంలో బీజేపీ మౌనంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, విభజన చట్టాన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌తో కేంద్రం చాటుమాటు వ్యవహారం మాదిరిగా బనకచర్లకు సంబంధించి వినతిని పరి గణనలోకి తీసుకోవడం సరికాదని హితవు పలి కారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. కేంద్రం సరైన సమ యంలో సరైన రీతిలో స్పందించకుండా సమస్యను జఠిలం చేసిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న అసమానతలు, చారిత్రక వాస్తవాలను కేంద్రం గ్రహించడం లేదని తప్పుపట్టారు. విభజన చట్టంలో నదీ జలాల వివా దం ప్రధానమైందనీ, ఆ వివాదాల పరిష్కారానికే కృష్ణా, గోదావరి నదు లకు ప్రత్యేక బోర్డుల ఏర్పా టు, ఆ రెండింటిపై ఒక అపెక్స్‌ బాడీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆ బోర్డు దగ్గరికి వెళితే రాష్ట్ర ప్రభు త్వానికి అక్కడే అభ్యంతరం చెప్పే అవకాశం ఉండేదని తెలిపారు. అలా కాకుండా కేంద్ర ప్రభు త్వం దగ్గరికి వెళ్లడం, కేంద్రం కూడా ప్రోత్సహిం చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. నికర జలాల సంగతి తేల్చకుండా మిగులు జలాల గురించి మాట్లాడటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమ తిచ్చి, నీటి కేటాయింపులు పూర్తి చేస్తే, మిగిలిన జలాలను వాడుకున్నట్టని వివరించారు. తెలంగా ణకు జరిగే జలదోపిడీకి వ్యతిరేకంగా కలిసొచ్చే శక్తులన్నింటిని కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చ రించారు. అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. గత బీఆర్‌ఎస్‌ పాలకులు పదేళ్లు ప్రజలను మభ్యపెట్టి, చరిత్రను దాచిపెట్టి, నదీ జలాల వాటాను వాడుకునే అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు.
కాళేశ్వరం ఉమ్మడి నిర్ణయం కాదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నాటి క్యాబినెట్‌ తీసుకున్న ఉమ్మడి నిర్ణయమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ చేప్పిన దానిపై కోదండ రాం స్పందించారు. నాటి క్యాబినెట్‌లో ఉన్న ఇతర మంత్రులు అది ఉమ్మడి నిర్ణయం కాదని చెప్పారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ ఉపాధ్య క్షులు అంబటి శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు ధర్మార్జున్‌, బైరి రమేష్‌, గోపగని శంకర్‌ రావు, పల్లె వినరు, నిజ్జన రమేష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -