నవతెలంగాణ-హైదరాబాద్: దేశాన్ని దిగ్బ్రాంత్రికి గురిచేసిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. బాంబు పేలుళ్లు సంఘటనలో మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. కేంద్రంలోనూ, ఢిల్లీలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, కేంద్ర నిఘా సంస్ధలు వారి ఆధీనంలోనే పనిచేస్తున్నాయి. ఈ ఘటన జరగడానికి కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్ధల వైఫల్యమే కారణమని విమర్శించింది.
ఈ పేలుళ్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఘటనపై వెంటనే అత్యున్నత స్ధాయి దర్యాప్తు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.



