నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బక్రీద్ పండగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణా జరక్కుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మండల కేంద్రం శివారులోని జంబి హనుమాన్ దేవాలయం సమీపంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై పోలీస్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి నుండి జగిత్యాల జిల్లా మెట్ పల్లి వైపు వెళ్లే వాహనాలను, అటు నుండి మండల కేంద్రానికి వచ్చే వాహనాలను ఎస్సై ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మండలంలో ఎక్కడైనా పశువుల ఆక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు గాని, డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలని ఎస్ఐ అనిల్ రెడ్డి ప్రజలకు సూచించారు.
జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES