– ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా ఘనత
– జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
జమ్మూకాశ్మీర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ రైలు వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్లో పర్యటించిన మోడీ.. అక్కడ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చీనాబ్ రైలు వంతెనను ఆవిష్కరించారు. జెండా ఊపి రైల్వే వంతెనపై రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీసిన కోచ్లో ప్రధాని ప్రయాణించారు. చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. ఈ వంతెన జమ్మూకాశ్మీర్లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్-కౌరీ మధ్య ఉన్నది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జ్ను ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. ఇక తన పర్యటనలో భాగంగా సుమారు రూ.46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
‘చీనాబ్’ విశేషాలివే..!
చీనాబ్ వంతెనలో చాలా విశేషాలున్నాయి. ఉక్కు, కాంక్రీట్తో నిర్మించిన ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబారు రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కాశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఏర్పడింది. భూకంపాలు, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల్ని తట్టుకోగల ఈ వంతెన జీవితకాలం 120 ఏండ్లు. ఆర్చ్ ఆకృతిలో నిర్మించిన ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు ఎక్కువ. నదీగర్భం నుంచి ఈ బ్రిడ్జి 1,178 అడుగుల ఎత్తులో ఉన్నది. వంతెన నిర్మాణం కోసం 28 వేల టన్నుల స్టీల్, 6 లక్షల బోల్ట్లు వాడినట్టు తెలుస్తు న్నది. నిర్మాణ వ్యయం రూ.1483 కోట్లు. వంతెనకు ఇరువైపులా 93 డెక్ సెగ్మెంట్స్ను ఉపయోగించగా, ఒక్కోటి 85 టన్నుల బరువు ఉంటుందట.
చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES