Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం..మైరావణకు యువ పురస్కారం

కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం..మైరావణకు యువ పురస్కారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం బాలసాహిత్య, యువ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 24 భాషల్లో ఉత్తమ రచనలను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్‌ రచించిన ‘కబుర్ల దేవత’ (స్టోరీ) పుస్తకాన్ని కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించగా.. ప్రసాద్‌ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించి పలు పుస్తకాలను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ అధ్యక్షతన బుధవారం సమావేశమైన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఈ పురస్కారానికి ఎంపికైన పుస్తకాల పేర్లను ప్రకటించింది. అయితే, ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారం ప్రకటించలేదు. దీంతో ఈ విభాగంలో 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలు ప్రకటించారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad