Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకన్నుమూసిన రవితేజ తండ్రి.. ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి

కన్నుమూసిన రవితేజ తండ్రి.. ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోట శ్రీనివాసరావు, బి.సరోజాదేవి మరణ వార్తలు మరువకముందే… స్టార్ హీరో రవితేజ ఇంట విషాదం చోటుచేసుకుంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. రవితేజ తండ్రి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణ వార్త ఎంతో బాధించిందని చిరంజీవి అన్నారు. చివరిసారిగా ఆయనను ‘వాల్తేరు వీరయ్య’ సెట్ లో కలిశానని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడుని కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img