- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామం వద్ద గల శాంభవి ఫిలింగ్ స్టేషన్ లో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఇందులో భాగంగా పెట్రోల్ బంక్ సిబ్బంది శాంటా క్లాస్ దుస్తువులు ధరించి బంకులో డీజిల్, పెట్రోల్ పోసుకున్న ప్రతి ఒక్కరికి చాక్లెట్లను, బహుమతులను అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంభవి ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు బొట్ల రవీన్ ప్రసాద్, బొట్ల మధుసూదన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



