- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లను మార్చి 5న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. విద్యార్థులు సెకండరీ బోర్డు వెబ్సైట్, వాట్సాప్, లేదా పాఠశాలల ద్వారా వీటిని పొందవచ్చు. ఫీజు బకాయిల కారణంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, ఏ హాల్టికెట్తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడతాయి.
- Advertisement -


