- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ జిల్లా బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ తరఫున గెలిచిన 17 మంది సర్పంచ్ల సన్మానం విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో BJP నేత పిల్లి రామరాజుపై ఒక వర్గం దాడి చేయగా, జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డిపై మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘర్షణ వాతావరణంతో పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల కెమెరాలను కొందరు నేతాలు లాక్కున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



