- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం చంద్రబాబు ఢిల్లీ నుంచి తన నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు.
- Advertisement -