- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో శనివారం శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ఆదేశాలతో ఎండ్రపల్లి నవీన్ కుమార్, తరి నరేష్, కు పెద్దవూర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేపాకుల సాయి కుమార్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అంద జేశారు. ఈ సందర్బంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుసాయికుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు, సకాలంలో స్పందించి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడో వార్డ్ నెంబర్ చిలువేరు శివ, ఎరుకల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



