నవతెలంగాణ-తొగుట : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని పిఎసి ఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. శనివారం మండలం లోని గుడికంందుల గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో పిఎసిఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి బాధి తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అంద జేశారు. గ్రామానికి చెందిన చిన్న రాము గారి శివ మ్మకు రూ. 18 వేలు, ఆకుల రచనకు రూ. 12 వేలు, చిన్న రాము గారి చంద్రయ్యకు రూ. 18 వేల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగ పడుతుందన్నారు. అనుకోకుండా ప్రమాదాల బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసు కున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ తో ఎంతో సహకా రం అందుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లయ్య, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బైరా గాడ్, నాయకులు గురువారెడ్డి, భూపాల్ రెడ్డి, ఉప్పరి కమలాకర్, యెహను, రాకేష్, బద్రి తది తరులు పాల్గొన్నారు
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES