సీఎం రిలీఫ్ ఫండ్  పేదలకు ఓ వరం

– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
 నవతెలంగాణ- చండూర్ 
 పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో మేడిపల్లి లక్ష్మణ్ కుమారుడు గౌతమ్ బ్రెయిన్ లో గడ్డ ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో మానసికంగా ఆరోగ్యం క్షీణిస్తుందని, పెద్ద మొత్తంలో ఆపరేషన్ కు ఖర్చవుతుందని డాక్టర్లు తెలుపగా, స్థానిక కాంగ్రెస్ నాయకులైన కోడి శ్రీనివాసులు, దోటి వెంకటేశ్ యాదవ్ లు ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన  వెంటనే స్పందించి ప్రభుత్వం ద్వారా 2,50,000/-రూపాయల ఎల్వోసి ని మంజూరు చేపించి మంగళవారం  మునుగోడు క్యాంప్ కార్యాలయం లో బాలునికి అందించారు. ఆపరేషన్ కు ఖర్చు ఎక్కువైనా భరిస్తామని, డాక్టర్లతో మాట్లాడతానని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాలుని తల్లిదండ్రులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూతరాజు వేణు, ఐతరాజు మల్లేష్, కల్లెట్ల మారయ్య, ముజ్జు, నల్లగంటి మల్లేశ్, వెంకన్న, గంజి వెంకటేశ్వర్లు, రావిరాల రాజు, చెరిపెల్లి సాయి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love