Friday, June 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిమాన ప్రమాదంపై సీఎం రేవంత్‌ విచారం

విమాన ప్రమాదంపై సీఎం రేవంత్‌ విచారం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికీ, వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -