Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుడాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్ ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. తన ఇంద్రజాల విద్య ద్వారా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. పట్టాభిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad