- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కార్మిక ఉద్యమాల నుండి ప్రముఖ ప్రజా నాయకుడిగా ఎదిగిన అచ్యుతానందన్, ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో కేరళ పురోగతికి ఎనలేని సేవ చేశారని గుర్తుచేసుకున్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి తన సంతాపాన్ని, హృదయపూర్వక సానుభూతిని తెలిపారు.
- Advertisement -