- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: సరిహద్దుల్లో సైనికుల్లా రాష్ట్రంలో పోలీసులు శాంతిభద్రతలు కాపాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా ఇస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్ల కుటుంబాలకు రూ.2కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
- Advertisement -